Thursday, May 16, 2024

గౌతు శివాజీ అరెస్ట్ – కంట‌త‌డిపెట్టిన శీరిష‌..

శ్రీకాకుళం – మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టు ఖండిస్తూ 3వ రోజు పలాస కేటి రోడ్లో రీలే నిరాహార దీక్షను టీడీపీ శ్రేణులు చేపట్టారు. దీక్షకు సంఘీభావం తెలుపుతున్న మాజీ మంత్రి గౌతు శివాజీ ని కాశిబుగ్గ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. దీంతో గౌతు శిరీష, టిడిపి నాయకులు నినాదాలు చేస్తూ ర్యాలీగా కాశిబుగ్గ పోలీస్ స్టేషన్ కు వెళ్లారు.

మాజీ మంత్రి గౌతు శివాజీ పోలీస్ స్టేషన్లో అస్వస్థకు గురి కావడంతో తక్షణమే వైద్యం నిమిత్తం కాశీబుగ్గలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి పోలీసులు తరలించారు .అయితే శివాజీ ఆచూకీ తెలియకపోవడం పోలీసులకు అడిగినా వారు చెప్పకపోవడంతో శిరీష, టిడిపి నాయకులు స్టేషన్ వద్ద ఆందోళన చేపడుతుండగా శిరీష తండ్రి ఆరోగ్య పరిస్థితి పై ఆందోళన వ్య‌క్తం చేశారు.. త‌న తండ్రి ఆచూకీ తెలియ‌క‌పోవ‌డంతో ఆమె క‌న్నీరు మున్నీర‌య్యారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement