Saturday, May 4, 2024

AP: మావోయిస్టు మహిళా నేత అరెస్ట్

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం తనకల్లు మండలం సున్నంవారి పల్లి గ్రామానికి చెందిన మరువపల్లీ రాజి అలియాస్ సరస్వతి అనే మావోయిస్టు మహిళా నేతను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ఎస్ వి మాధవరెడ్డి తెలిపారు. 1999 మావోయిస్టు నేత ఆర్ వై ఎఫ్ నాయకులు ఎస్ ఎ రవూఫ్ భావజాలానికి ఆకర్షితురాలై మొదట ఆర్ వైఎఫ్ లో చేరారు. అప్పటినుంచి మావోయిస్టు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేది.

ప్రస్తుతం మావోయిస్టు జోనల్ కమిటీ మెంబర్ స్థాయిలో ఉన్నారు. ఈమె కేంద్ర కమిటీ సభ్యుడు సంజయ్ దీపక్ రావును 2007లో వివాహం చేసుకోవడం జరిగింది. కేరళ, తమిళనాడు, ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలు సాగిస్తూ వస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంకు అందిన సమాచారంతో మావోయిస్టు మహిళా నేతను కొత్తచెరువు వద్ద అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచనున్నట్లు ఎస్పీ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement