Thursday, May 2, 2024

HZB: హ‌రీశ్ హామీ పట్టించుకోని మామిడాల‌ప‌ల్లి.. ద‌త్త‌త తీసుకుంటాన‌న్నా ద‌య‌చూప‌ని ఓట‌ర్లు..

క‌రీంన‌గ‌ర్ జిల్లా హుజురాబాద్ బై ఎల‌క్ష‌న్స్‌లో టీఆర్ ఎస్‌కు ఎదురుదెబ్బ త‌గులుతోంది. తొలుత ద‌ళిత బంధు ప్రారంభించిన శాల‌ప‌ల్లి విలేజ్‌లో అధికార పార్టీకి ఆద‌ర‌ణ లేకుండా పోయింది. అక్క‌డ బీజేపీ అభ్య‌ర్థి ఈటల రాజేంద‌ర్ కంటే చాలా త‌క్కువ ఓట్లు టీఆర్ ఎస్ అభ్య‌ర్థి గెల్లు శ్రీ‌నివాస్ యాద‌వ్‌కు వ‌చ్చాయి. అంతేకాకుండా.. వీణ‌వంక మండ‌లంలోనూ బీజేపీ ఆధిక్య‌త కొన‌సాగుతోంది. వీణ‌వంక మండ‌లం మామిడాల ప‌ల్లి గ్రామాన్ని ద‌త్త‌త తీసుకుంటాన‌ని మంత్రి హ‌రీశ్‌రావు హామీ ఇచ్చారు. అయినా మామిడాల‌ప‌ల్లి ఓట‌ర్లు అధికార పార్టీ హామీల‌ను న‌మ్మిన‌ట్టు లేరు. అందుక‌ని ఈట‌ల రాజేంద‌ర్‌కు ఎక్కువ పోలైన‌ట్టు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement