Wednesday, April 17, 2024

ఆయుష్‌ మంత్రిత్వశాఖలో నోటిఫికేషన్‌లు విడుద‌ల..

భారత ప్రభుత్వానికి చెందిన ఆయుష్‌ మంత్రిత్వ శాఖ పలు పోస్టుల‌కు నోటిఫికేషన్‌ జారీ కాగ‌.. నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 07 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ప్రస్తుతం దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది, ఈనెల 10న ప్రక్రియ ముగియనున్నది.

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
మొత్తం 07 ఖాళీలకుగాను సీనియర్‌ ప్రోగ్రాం మేనేజర్ (టెక్నికల్‌) – 01, జూనియర్‌ ప్రోగ్రాం మేనేజర్‌ (టెక్నికల్‌)-02, ప్రోగ్రాం మేనేజర్‌ (అడ్మినిస్ట్రేటివ్‌) – 02, డేటా అసిస్టెంట్‌ – 01, మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌ – 01 భర్తీ చేయనున్నారు.

పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఖాళీలను అనుసరించి ఇంటర్మీడియట్‌, సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, ఎంబీఏ, పీజీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.వీటితో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, రీసెర్చ్‌ కౌన్సిల్‌, ప్రభుత్వరంగ సంస్థల్లో మూడేళ్లు పనిచేసి అనుభవం ఉండాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement