Thursday, May 16, 2024

23న కాంగ్రెస్ లోకి పీజేఆర్ కూతురు విజయా రెడ్డి

ఖైరతాబాద్ డివిజన్ నుంచి టీఆర్ఎస్ కార్పొరేటర్ గా ఎన్నికైన విజయారెడ్డి ఆ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 23న కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్న‌ట్లు మాజీ మంత్రి పి.జనార్దన్ రెడ్డి (పీజీఆర్) కూతురు విజ‌యా రెడ్డి ప్ర‌క‌టించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో సమావేశమైన అనంతరం ఆమె తన నిర్ణ‌యాన్ని తీసుకుంన్న‌ట్లు తెలిపారు. విజయా రెడ్డి కాంగ్రెస్ లోకి చేర‌నున్న‌ట్లు మొన్న‌టిదాక వార్త‌లు వ‌చ్చాయి. వాటిని నిజం చేస్తూ కాంగ్రెస్ కూటికి చేర‌నున్న‌ట్లు ఆమె తెలిపారు. మంచి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని తెలిపారు. తనకిప్పుడు ఇంటిపార్టీలోకి వస్తున్నాననే భావన ఉందని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement