Monday, April 29, 2024

అగ్నిపథ్ పై సుప్రీంకోర్టులో పిటిషన్

దేశవ్యాప్తంగా అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ అగ్నిపథ్‌పై వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ దేశ అ‍త్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఈరోజు పిటిషన్‌ దాఖలైంది. అగ్నిపథ్‌ స్కీమ్‌కు వ్యతిరేకంగా హింసాత్మక నిరసనల గురించి విచారించడానికి, రైల్వేతో సహా ప్రజా ఆస్తులకు జరిగిన నష్టం గురించి విచారించడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేయాలని పిటిషనర్‌ న్యాయస్థానాన్ని కోరారు. ఈ పథకంలో జాతీయ భద్రత, సైన్యంపై దాని ప్రభావాన్ని అధ్యయనం చేయడానికి రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఢిల్లీకి చెందిన న్యాయవాది సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement