Monday, May 6, 2024

వాస‌వి ట్ర‌స్ట్ భ‌వ‌నం కోసం ఉప్ప‌ల శ్రీనివాస్ గుప్తా విరాళం

బాలానగర్ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తాను నాగోల్ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి సన్మానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా.. బాలానగర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో.. హైదరాబాద్ లోని బాలానగర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించే వాసవి ట్రస్ట్ భవనం నిర్మాణం కోసం ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా ఒక లక్ష రూపాయల చెక్కు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో దారం వెంకటేశం గుప్తా, గన్ను తిరుపతయ్య, పడకంటి శ్రీనివాస్, ముత్యం ప్రభాకర్, దారం సతీష్ గుప్తా, శివశంకర్, రవీందర్, బాలానగర్ ఆర్యవైశ్య నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement