Thursday, May 2, 2024

పేదింటి అమ్మాయి పెళ్లికి ఉప్పల ఫౌండేషన్ చేయూత..!

ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. నిరుపేద కుటుంబానికి చెందిన పేద ఆడబిడ్డ పెళ్లికి మంగళసూత్రం, మెట్టెలు, చీరె, గాజులు విరాళంగా అంద‌జేశారు. హైదరాబాద్ లోని ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలోని, తట్టి అన్నారంకి చెందిన నిరుపేద కుటుంబం, బీసీ యాదవ్ కమ్యూనిటీ, జింకల సంధ్య- శంకర్ ల కూతురు నందిని వివాహం కోసం హైదరాబాద్ నాగోల్ లోని ఉప్పల శ్రీనివాస్ గుప్తా నివాసంలో క‌లిశారు.

ఈసంద‌ర్భంగా వారికి ఉప్పల ఫౌండేషన్ ఆధ్వర్యంలో.. తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ పూర్వ చైర్మన్, ఉప్పల ఫౌండేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా చేతుల మీదుగా మంగళసూత్రం, మెట్టెలు, చీర, గాజులు విరాళంగా అంద‌జేశారు. ఈ కార్యక్రమంలో.. పెళ్లి కూతురు తల్లిదండ్రులు సంధ్య- శంకర్, కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కి చెందిన ఆర్యవైశ్య నాయకులు రాజయ్య, జానయ్య, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement