Sunday, April 28, 2024

HYD: నూతన అవుట్‌లెట్‌ ను హైదరాబాద్ లో ప్రారంభించిన ది స్లీప్ కంపెనీ

హైద‌రాబాద్ : భారతదేశంలోని ప్రముఖ కంఫర్ట్-టెక్ బ్రాండ్ ది స్లీప్ కంపెనీ, భారతదేశంలో తమ 75వ స్టోర్‌ను హైదరాబాద్‌లోని హిమాయత్ నగర్‌లో వైభవంగా ప్రారంభించింది. ఈ నూతన స్టోర్ నగరంలో కంపెనీ 8వ అవుట్‌లెట్‌గా నిలిచింది, మంచి నాణ్యమైన నిద్ర పరిష్కారాల కోసం నగరవాసుల నుండి పెరుగుతున్న డిమాండ్‌ను ఇవి తీర్చనున్నాయి. ఒకసారి ఈ అవుట్‌లెట్‌లోకి వినియోగదారులు అడుగుపెడితే, విస్తృతమైన రీతిలో ఉత్పత్తి శ్రేణిని వారు అన్వేషించవచ్చు.

ఈసంద‌ర్భంగా ది స్లీప్ కంపెనీ సహ వ్యవస్థాపకురాలు ప్రియాంక సలోట్ మాట్లాడుతూ… త‌మ 75వ స్టోర్ ప్రారంభోత్సవం త‌మకు ఒక ప్రతిష్టాత్మకమైన సందర్భమ‌న్నారు. ఇది త‌మ నిరంతర ఆవిష్కరణల ప్రయాణాన్ని ప్రతిబింబించడమే కాకుండా భారతదేశం నిద్రిస్తున్న విధానాన్ని పునర్నిర్వచించాలనే త‌మ నిబద్ధతను సైతం ప్రతిబింబిస్తుందన్నారు. 2024 చివరి నాటికి దేశవ్యాప్తంగా 150కి పైగా స్టోర్‌లను ప్రారంభించాలని తాము ప్రణాళిక చేసామన్నారు.

త‌మ పరివర్తన నిద్ర పరిష్కారాలను దేశవ్యాప్తంగా ఉన్న కస్టమర్‌లకు మరింత చేరువ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. త‌మ ప్రత్యేకత ఏమిటంటే త‌మ స్టోర్‌లన్నీ కూడా కంపెనీ యాజమాన్య పరిధిలో, కంపెనీ-నిర్వహిస్తున్న (కోకో) స్టోర్లు అన్నారు. తద్వారా వినియోగదారులందరికీ స్థిరమైన బ్రాండ్ అనుభవాన్ని, సర్వీస్ ఎక్సలెన్స్‌ని నిర్ధారిస్తుందన్నారు. నిద్ర ప్రశాంత శక్తిని స్వీకరించడానికి, ఆరోగ్యకరమైన, సంతోషకరమైన జీవితాలను గడపడానికి వ్యక్తులను శక్తివంతం చేయాలనే త‌మ లక్ష్యం మారదన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement