Tuesday, April 30, 2024

మేయర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మైనార్టీ సోదరులు

బాచుపల్లి : నిజాంపేట్ కార్పొరేషన్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని ముస్లిం మైనారిటీ సోదరులు ఇవాళ మర్యాద పూర్వకంగా కలిశారు. కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ సలీం ఆధ్వర్యంలో ముస్లిం మైనారిటీ సభ్యులు సాయి నగర్ లో వారికి కేటాయించిన స్థలానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇచ్చినందుకు కృతజ్ఞతగా మేయర్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. అనంతరం మేయర్ ను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు వాణి శ్రీనివాస్, సీనియర్ నాయకులు చంద్రగిరి సతీష్, శ్రీనివాస్, బాచుపల్లి ముస్లిం మైనారిటీ జెనరల్ సెక్రెటరీ యం.ఏ.నబీ, వైస్ ప్రెసిడెంట్ అలీ, సభ్యులు షకీల్, సలీం, ఫారుక్, పాషా, శంషుద్దీన్, సగిర్, చాంద్, ఇతర ముఖ్య సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement