Sunday, April 28, 2024

Telangana Elections -ఎన్నికల పరిశీలకులుగా 67 మంది ఐఏఎస్, 39 మంది ఐపీఎస్ అధికారులను నియమించిన కేంద్ర ఎన్నికల సంఘం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా 39 మంది ఐపీఎస్ అధికారులను పోలీసు పరిశీలకులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరంతా ఈ నెల 10వ తేదీ నుంచి విధులకు హాజరుకానున్నారు.

తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల సంఘం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా తాజాగా ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులను నియమించింది. ఇతర రాష్ట్రాలకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పరిశీలకులుగా బాధ్యతలు అప్పగించింది. 67 మంది ఐఏఎస్ అధికారులను సాధారణ పరిశీలకులుగా నియమించింది. ఎన్నికల నిర్వహణ ప్రక్రియను ఆయా నియోజకవర్గాల్లో ఈ పరిశీలకులు పర్యవేక్షించనున్నారు

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement