Sunday, April 28, 2024

Eluru: ఈనెల 2,3,4 తేదీల్లో అక్వా ఎక్స్ ఇండియా ప్రదర్శన

కాళ్ళ, నవంబర్ 2 (ప్రభ న్యూస్) : ఈనెల 2, 3, 4 తేదీల్లో అక్వా ఎక్స్ ఇండియా ప్రదర్శన కాళ్ళ మండలం అమిరంలోని రాధాకృష్ణ కన్వేషన్ హాల్లో నందు అక్వాఎక్స్ ఇండియా 2023 ప్రదర్శనను కైకలూరు శాసన సభ్యులు దూలం నాగేశ్వరరావు (DNR), శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ తో కలసి గురువారం ప్రారంభించారు. ఈ సదస్సులో ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సందర్శించి, అనంతరం సదస్సు కు జ్యోతి ప్రకాశనం చేసి మూడురోజుల పాటు నిర్వహించే ఆక్వాఎక్స్ ఇండియా-2023 రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు, ఉండి డీసీసీబీ చైర్మన్ పివియల్ నరసింహారాజు, పద్మశ్రీ ఏం విజయగుప్తా, క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ పాతపాటి శ్రీనివాసరాజు, సదస్సు ఆర్గనైజర్ డి వేణు, డా. సికెఎన్ మూర్తి, స్టాల్స్ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement