Thursday, May 2, 2024

HYD : ఎల్బీనగర్ అభివృద్ది ప్రదాత సుధీర్ రెడ్డి కే మా మద్ధతు

నాగోల్, నవంబర్ 15(ఫ్రభ న్యూస్)
ఎల్.బి నగర్ నియోజకవర్గాన్ని అన్నివిధాల అభివృద్ధి చేసిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డికే మా పూర్తి మద్దతు అని నాగోల్ కాలనీ వాసుల ఆత్మీయ సమావేశం లో అన్ని కాలనీ లకు చెందిన కాలనీల వాసులు అన్నారు. ఈ సందర్బంగా బుధవారం ఉదయం ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి నాగోల్ డివిజన్ పరిధిలోని సౌత్ ఎండ్ పార్క్,సెవెన్ హిల్స్,ద్వారక నగర్, డి.పీ.నగర్,సాయి సప్తగిరి కాలనీ,జనప్రియ ఎంక్లేవ్, శ్రీసాయి నగర్,సాయి రాఘవేంద్ర కాలనీ, కీర్తన ఎంక్లేవ్,మధురనగర్ ఫేస్ 1అండ్‌ 2,ధనలక్ష్మి నగర్,బృందావన్ కాలనీ,ఆదిత్య నగర్,విజయ గార్డెన్స్,న్యూ అజయ్ నగర్,అయోధ్య నగర్,శివాణి నగర్,శ్రీనివాస కాలనీ,బండ్లగూడా విలేజ్ పార్ట్ నందు కాలనీవాసుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ముక్తకంఠంతో మాట్లాడుతూ ఇట్టి నియోజకవర్గన్నీ అభివృద్ధి చేసిన ఘనత మీదే అని కొనియాడారు.మా ఓటు మీకే అని తెలిపారు. కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి, మీరు విజయం సాదించక అప్పుడు మిమ్మల్ని అడుగుతాము అని తెలిపారు.ఇతర పార్టీల వారి యొక్క మాటలు మేము నమ్మము అని ముక్తకంఠంతో తెలిపారు.మరింత అభివృద్ధి కావాలంటే మీతో సాధ్యం అని తెలిపారు.మేమే మా కాలనీ నందు మీ కోసం ప్రచారం చేస్తామని హామీ ఇచ్చారు.కారు గుర్తుకు మా ఓటు అని తెలిపారు. అనంతరం ఇతర పార్టీల నుంచి బారస పార్టీలోకి చేరిక కావడం జరిగింది.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆనంతుల రాజిరెడ్డి, మాజీ కార్పొరేటర్ చెరుకు సంగీత ప్రశాంత్ గౌడ్,డివిజన్ అధ్యక్షులు చిరంజీవి, సుర్వీ రాజు గౌడ్ ,ప్రమీల,మైసయ్య, సీతారాములు,ఈశ్వరయ్య,సతీష్ యాదవ్,కత్తుల రాంబాబు,నరేష్,భాస్కర్ యాదవ్,రంజిత్, సీనియర్ నాయకులు కాలనీ అధ్యక్ష,కార్యవర్గ సభ్యులు,మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement