Friday, May 17, 2024

HYD : ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా.. బిఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ రెడ్డి

కర్మన్ ఘాట్, నవంబర్ 15 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ నియోజకవర్గం దేశంలోనే ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుటకు మరొకసారి అవకాశం ఇవ్వాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవి రెడ్డి సుధీర్ రెడ్డి కోరారు. లింగోజిగూడా డివిజన్ మాజీ అధ్యక్షులు తిలక్ రావు ఆధ్వర్యంలో హరిజన బస్తీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ నుండి బారస పార్టీలో చేరారు.

ఎల్బీనగర్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి,మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాసరావు,డివిజన్ అధ్యక్షులు వరప్రసాద్ రెడ్డి సమక్షంలో సుధీర్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.చేరిక అయిన వారిలో రమేష్, రమణ, రాంలింగం,జగదీష్,యశ్వంత్,హేమంత్, శ్రీనివాస్,ప్రమోద్ మాట్లాడుతూ సుధీర్ రెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం చేస్తున్న కృషి,సంక్షేమ పథకాలు నచ్చి బారస పార్టీలోకి చేరిక కావడం జరిగిందని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో సుధీర్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలతో నియోజకవర్గన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం జరిగిందని గుర్తు చేశారు.ఇంకా కొన్ని కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా దశలవారీగా పరిష్కారం చేస్తామని తెలిపారు.రాష్ట్రంలో ప్రతి పక్షాలకు స్థానం లేదని అన్నారు.ఇతర పార్టీల వారి మాటలు నమ్మి మోసపోవొద్దు అని తెలిపారు. సంక్షేమం,అభివృద్ధి కావాలంటే వచ్చే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి నియోజకవర్గ అభివృద్ధికి మీ యొక్క సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మేకల రాజశేఖర్ రెడ్డి, కర్మన్ ఘాట్ హనుమాన్ దేవాలయం ధర్మకర్త మధుసాగర్,నాయకులు ఆడాల రమేష్,సత్యంగౌడ్,టీంకు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement