Sunday, April 28, 2024

ఘనంగా శ్రీరాముని పట్టాభిషేక మహోత్సవం..

కవాడిగూడ : శ్రీరామనవమి పర్వదినోత్సవంను పురస్కరించుకొని ముషీరాబాద్‌ నియోజకవర్గం ఆర్టీసి క్రాస్‌రోడ్‌లోని శ్రీ లక్ష్మి గణపతి దేవాలయంలో శ్రీరాముని పట్టాభిషేకం వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే ముఠా గోపాల్‌, టి ఆర్‌ఎస్‌ యువనేత ముఠా జయసింహా, దేవాలయం, చైర్మన్‌, ముచ్చకుర్తి ప్రభాకర్‌ తదితరులు ఈ వేడుకలలో పాల్గొని స్వామివారికి ఆభరణాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ మాట్లాడుతూ శ్రీరామ నవమి పర్వదినం, రాములోరి పట్టాభిషేకం జరుపుకోవడం మన సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతిభింభమని అన్నారు. ప్రతి సంవత్సరం శ్రీ రామనవమి రోజున శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు నిర్వహించి శ్రీ రాముని పట్టాభిషేకం చేయడం అనవాలుగా వస్తుందన్నారు. గత రెండు సంవత్సరాలుగా కరోనా మహామ్మారి వల్ల అంగరంగ వైభవంగా వేలాది మంది భక్తుల మద్య చేయలేకపోతున్నామన్నారు. ఆ భగవంతుడు కరుణించి అందరిని చల్లాగా చూడాలని, వచ్చే సంవత్సరం శ్రీ సీత రాముల కళ్యాణంతో పాటు పట్టాభిషేకం వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఆశీర్వదించాలని భగవంతున్ని వేడుకుంటున్నట్లు ఆయన చెప్పారు. కార్యక్రమంలో టిఆర్‌ఎస్‌ నేతలు ముఠా జయసింహా, ఆలయ చైర్మన్‌ ముచ్చకుర్తి ప్రభాకర్‌ దంపతులు, ఆలయ సిబ్బంది, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement