Tuesday, May 14, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన సింగ‌ర్ శ్రీల‌లిత

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్కులో ప్రముఖ సింగర్ శ్రీ లలిత మొక్క‌లు నాటారు. ఈ సందర్భంగా శ్రీ లలిత మాట్లాడుతూ… ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటడం సంతోషంగా ఉందన్నారు.

ప్రకృతి మనకు తల్లిలాంటిదని, అలాంటి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని శ్రీ లలిత కోరారు. అనంతరం ఈ ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని సింగర్స్ షణ్ముఖ ప్రియ, రమ్య బెహ్రా, రాస్తా రామ్ ముగ్గురికి ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement