Wednesday, May 15, 2024

సమస్యలు లేని డివిజన్‌గా తీర్చిదిద్దుతాం..

జవహర్‌నగర్‌ : డివిజన్‌ లో ఉన్న భూగర్భ డ్రైనేజి సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని జవహర్‌నగర్‌ మున్సిపల్‌ కార్పోరేషన్‌ 9వ డివిజన్‌ కార్పోరేటర్‌ శారద మనోదర్‌రెడ్డి అన్నారు. 9వ డివిజన్‌లో కాలనీ వాసుల సహాయ సహకారాలతో తమ సోంత నిధులతో 100మీటర్ల భూగర్భ డ్రైనేజి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెరాస పార్టీతోనే డివిజన్‌ అభివృద్ది చెందుతుందని వారన్నారు. డివిజన్‌లో మౌలిక వసతులను కల్పించేందుకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డితో సంప్రదించి నిధులను తీసుకు వచ్చి డివిజన్‌లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని 9వ డివిజన్‌ ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమసస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తానని వారు పేర్కోన్నారు. ఈ కార్యక్రమంలో 9వ డివిజన్‌ టిఆర్‌ ఎస్‌ పార్టీ అధ్యక్షులు ఎండి రఫిక్‌, జనరల్‌ సెక్రటరీ బహదూర్‌ ఆలీ, డివిజన్‌ యువజన సంఘం అధ్యక్షులు సాయిరాజ్‌ గౌడ్‌ ,కాలనీ వాసులు, ప్రభాకర్‌ , శేఖర్‌, సరిత, పద్మ, లోకేష్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement