Friday, May 17, 2024

స‌జ్జ‌ల సోద‌రుడు క‌న్నుమూత‌..

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సోదరుడు, పారిశ్రామికవేత్త దివాకర్‌ రెడ్డి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడతున్న ఆయన హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. కాగా,దివాకర్‌రెడ్డి మరణవార్త తెలిసి సజ్జల రామకృష్ణారెడ్డి హైదరాబాద్ కు వ‌చ్చారు.. ఇక దివాకర్‌రెడ్డి మరణం పట్ల ఏపీ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ దేవిరెడ్డి శ్రీనాథ్‌రెడ్డి , ఎపి ప్ర‌భుత్వ జాతీయ మీడియా స‌ల‌హాదారు దేవుల‌ప‌ల్లి అమ‌ర్ సంతాపం ప్రకటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement