Saturday, May 18, 2024

అసలు సంగతి ఏంటంటే..?

ఏపీలోని ఉండవల్లి సెంటర్‌లో పంచాయతీ కార్మికులకు నోట్ల కట్టలు దొరికాయి. రోడ్లపై పడిన చెత్తను ఊడ్చేందుకు పంచాయతీ కార్మికులు డ్యూటీ ఎక్కగా.. ఉండవల్లి సెంటర్‌లోని ఎస్‌బీఐ వద్ద చీపుర్లు పట్టి చెత్తను ఓ వైపునకు ఊడ్చి ఎత్తుతున్నారు. ఇంతలో కార్మికులకు ఓ రూ.500 నోటు కనిపించింది. అదృష్టం బాగుందని దానిని తీసి దాచారు. చెత్త ఎత్తే కొద్దీ నోట్లు దొరుకుతూనే ఉన్నాయి. ఏంటా అని మొత్తం చెత్త తీసే సరికి దాదాపు 30 దాకా రూ.2000, రూ.500, రూ.200 నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి.

ఆ నోట్ల కట్టలను చూసి భయపడిపోయిన పంచాయతీ కార్మికులు వెంటనే గ్రామ సచివాలయ సిబ్బందికి సమాచారమిచ్చారు. సిబ్బంది వచ్చి ఆ నోట్లను పరిశీలించి చూశారు. దొంగనోట్లు అనుకున్నారు. తీరా చూస్తే కట్టలన్నింటినీ క్షుణ్ణంగా చూస్తే.. దాని మీద చిల్డ్రెన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫర్ స్కూల్ జోన్ అని రాసి ఉంది. దీంతో ఊపిరి పీల్చుకున్న సిబ్బంది.. ఓ నవ్వు నవ్వి ఊరుకున్నారు. దీంతో సదరు నోట్ల కట్టలను చెత్తలో వేసేసి డంప్ యార్డుకు పంపించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement