Monday, May 20, 2024

రహదారి భద్రతపై విద్యార్థులకు అవగాహన సదస్సు

మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో రోడ్ సేఫ్టీ క్లబ్, జాతీయ సేవా పథకం తరపున విద్యార్థులకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు నిర్వహించారు. కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, సెక్రటరీ మర్రి రాజశేఖర్ రెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాసరావు, ట్రాఎక్స్ ఎన్జీఓ ఆదిశంకర్, సతార్క్ ప్రతినిధులు సైఫ్, నితిన్ పాటిల్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఉదయ్ రంజన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులంద‌రూ కూడా రోడ్డు భద్రతా నియమాలు పాటించాలన్నారు. రోడ్డు భద్రత మీద అవగాహన పెంచుకోవడంతో పాటు తోట విద్యార్థులకు కూడా అవగాహన కల్పించి సురక్షితంగా ఉండాలనీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె శ్రీనివాసరావు అన్నారు. ట్రాఎక్స్ ప్రతినిధులు ఢిల్లీ నుండి టైర్ సేఫ్టీ మీద ఆన్‌లైన్ మధ్యమంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి విద్యార్థులకు పలు సూచనలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement