Sunday, April 28, 2024

మంత్రి కేటీఆర్ పై పొన్నాల ఫైర్..

మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత పొన్నాల లక్ష్మయ్య రాష్ట్ర మంత్రి కేటీఆర్ పై ఫైరయ్యారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ రోజుకో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. మాటలతోనే పబ్బం గడుపుకునే ప్రభుత్వం ఇది అని వ్యాఖ్యానించారు. నిజాంసాగర్ నీటితో కళకళలాడుతోందని అనడానికి సిగ్గుండాలని మండిపడ్డారు. కాళేశ్వరం నుంచి నీటి లింకు ఇంకా పూర్తి కాలేదని… అప్పుడే నీళ్లు ఎలా వచ్చాయని నిలదీశారు. రాష్ట్రంలో రిజర్వాయర్లు అన్నీ ఖాళీగానే ఉన్నాయని, నీటితో నింపే పరిస్థితి లేదని పొన్నాల పేర్కొన్నారు. 71 లక్షల ఉద్యోగాలు అన్నారు… ఇప్పటికీ చర్యలు లేవని తెలిపారు. రాష్ట్రానికి ఎన్ని కొత్త కంపెనీలు వచ్చాయో బయటపెట్టాలని, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని పొన్నాల డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement