Tuesday, May 14, 2024

HYD: ఈటీఎస్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న ఫిజిక్స్ వాలా..

హైద‌రాబాద్ : భారత్‌లో అతిపెద్ద విద్యా వేదిక అయిన ఫిజిక్స్ వాలా (పీడబ్ల్యూ), ప్రముఖ అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సంపూర్ణ మార్గదర్శకత్వం, మద్దతును అందించడానికి, జీఆర్ఈ టీఓఈఎఫ్ఎల్ పరీక్షలకు సిద్ధం కావడానికి వారికి సహాయపడటానికి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ ఎడ్యుకేషనల్ అసెస్‌మెంట్, రీసెర్చ్ అండ్ మెజర్‌మెంట్ ఆర్గనైజేషన్ అయిన యూఎస్-ఆధారిత ఈటీఎస్ అనుబంధ సంస్థ ఈటీఎస్ ఇండియాతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

ఈసంద‌ర్భంగా పీడబ్ల్యూ అధికార ప్రతినిధి గౌరవ్ గులారియా మాట్లాడుతూ… ఈటీఎస్ ఇండియాతో త‌మ భాగస్వామ్యం విద్యార్థులను బలోపేతం చేయడం, ప్రపంచ స్థాయి విద్యకు తగిన అవకాశాలు లేని వారి కోసం ప్రపంచ వేదికను సృష్టించడం త‌మ మిషన్‌లో ఒక పరివర్తనాత్మక ముందడుగు అన్నారు. మన దేశం సరిహద్దుల లోపల లేదా అంతర్జాతీయ పరిధుల్లో అయినా, ఇది విద్యార్థుల ఆకాంక్షలను పెంపొందించడానికి, వారి కలలను కొనసాగించడంలో సహాయపడటానికి నిబద్ధతను ప్రదర్శిస్తుందన్నారు.

ఈటీఎస్ ఇండియా అండ్ దక్షిణాసియా కంట్రీ మేనేజర్ సచిన్ జైన్ మాట్లాడుతూ… ఈ భాగస్వామ్యం ఔత్సాహికులకు వారి అంతర్జాతీయ ఉన్నత విద్య అవకాశాలను పెంచడానికి మెరుగైన జీఆర్ఈ, టీఓఈఎఫ్ఎల్ పరీక్ష ప్రిపరేషన్ వనరులను అందిస్తుందన్నారు. ఫిజిక్స్ వాలా టెస్ట్ ప్రిపరేషన్ నైపుణ్యం, రీచ్ ద్వారా వారి అంతర్జాతీయ ఉన్నత విద్య, ప్రపంచ కెరీర్ కలలను సులభతరం చేయడం ద్వారా భారతదేశం నుండి భవిష్యత్తు నాయకులను అభివృద్ధి చేయడానికి తాము సంతోషిస్తున్నామన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement