Thursday, May 9, 2024

High Court – మేడిగ‌డ్డ‌పై విచార‌ణ …న్యాయ‌మూర్తిని కేటాయించాల్సిందిగా హైకోర్టుకు లేఖ‌…

హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణకు సిట్టింగ్ జడ్జిని కేటాయించాలని తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నాడు లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై జ్యుడీషీయల్ విచారణ నిర్వహిస్తామని తెలంగాణ శాసనమండలిలో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇవాళ తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ కు రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ లేఖ రాసింది.

ఇది ఇలా ఉంటే, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు విషయమై రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 12 చోట్ల విజిలెన్స్ అధికారులు ఏక కాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఇరిగేషన్ కార్యాలయంలో ఇటీవల కీలకమైన కంప్యూటర్లు, ఫైల్స్ మాయం కావడంపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు జరిగిన ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.

విజిలెన్స్ సోదాలు, జ్యుడీషీయల్ విచారణలో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కీలకంగా ఎవరు వ్యవహరించారనే దానిపై గుర్తించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ ప్రాజెక్టుకు టెండర్ ను ఎలా ఫైనల్ చేశారు. ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించింది ఎవరనే విషయాలపై రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.విజిలెన్స్ నివేదిక, జ్యుడీషీయల్ విచారణ రిపోర్టు ఆధారంగా ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం పేరుతో ఏం జరిగిందనే అంశాలను బయట పెట్టాలని ప్రభుత్వం భావిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement