Friday, May 3, 2024

Kishan Reddy – ల‌క్ష‌ మంది రాహుల్ లు , కెసిఆర్ లు ,అస‌దుద్దీన్ లు వ‌చ్చినా మోడీ గెలుపును ఆప‌లేరు …

హైద‌రాబాద్ – ఎవరు వద్దన్నా.. ఎవరు కాదన్నా.. ఏప్రిల్ లో జరిగే ఎన్నికల్లో నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని కావడం ఖాయమన్నారు కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి. లక్షమంది అసదుద్దీన్ లు,… ప‌ది లక్షల కేసీఆర్ లు.. కోటి మంది రాహుల్ గాంధీలు వచ్చినా మూడోసారి ప్రధానిగా నరేంద్రమోడీ కావడాన్ని అడ్డుకోలేరన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నమో యాప్ వికసిత్ భారత్ అంబాసిడర్ వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆయ‌న ప్ర‌సంగిస్తూ, తాను సైతం అన్నట్లు దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. 1990లో అద్వాని సారథ్యంలో అయోధ్యలో రామాలయం నిర్మించాలని బీజేపీ పాలమూరులో తీర్మానం చేసిందని గుర్తు చేశారు. అద్వాని రథయాత్ర చేపడితే దేశమంతా జేజేలు పలికిందని అన్నారు.

బానిస మనస్తత్వం నుంచి బయటపడేలా ప్రధాని మోడీ 15 వందల చట్టాలను రద్దు చేసి కొత్త చట్టాలు తెచ్చారన్నారు. అంతేకాకుండా.. కలల ఊహించనిది… మన కళ్ల ముందు అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయ్యిందని, బాబర్ కూల్చిన రామాలయాన్ని రక్తం చిందించకుండా మోడీ మళ్లీ నిర్మించారని ఆయన కొనియాడారు.

ప్రపంచంలో ఏ దేశంలో లేని యువశక్తి మనదేశంలో ఉందని ఆయన అన్నారు. ప్రపంచంలోని అనేక బహుళజాతి కంపెనీలకు భారతీయులే నాయకత్వం వహిస్తున్నారని, ఏ దేశం అభివృద్ధి చెందాలన్న యువతదే కీలకపాత్ర అని ఆయన వ్యాఖ్యానించారు.
2047లోపు భారత్ అభివృద్ధి చెందాలని ప్రతి భారతీయుడు సంకల్పం తీసుకోవాలని కిషన్‌ రెడ్డి అన్నారు. బుజ్జగింపు రాజకీయాలకు తిలోదకాలు ఇచ్చామని, వంశపారంపర్య రాజకీయాలకు ఆస్కారం లేకుండా పనిచేస్తున్నామన్నారు. కుటుంబ పార్టీలు దోపిడీ చేస్తున్నాయని వివ‌రించారు. ఆనాడు మోడీకి వీసా ఇవ్వని అమెరికా.. నేడు అదే వైట్ హౌస్ లో ప్రధాని మోడీని సత్కరించారన్నారు. ఎన్నికల కోసం కాద‌ని, . దేశాభివృద్ధి కోసం వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement