Wednesday, May 8, 2024

నారాయణ కాలేజ్ పెట్రో ఘటనలో ఒకరు మృతి

గత నెల 19వతేదీన హైదరాబాద్ నగరంలోని అంబర్ పేట నారాయణ కాలేజ్ లో జరిగిన పెట్రో ఘటనలో ఒకరు మృతిచెందారు. విద్యార్థి సాయి నారాయణ టీసీ కోసం కళాశాల చుట్టూ తిరిగారు. సందీప్, వెంకటాచారితో కలిసి సాయి నారాయణ కాలేజ్ కు వెళ్లారు. ప్రిన్సిపాల్ గదిలో సందీప్ ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. వెనకాలే ఉన్న దీపం నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సందీప్, వెంకటాచారి, ఏఓ అశోక్ రెడ్డికి తీవ్రగాయాలయ్యాయి. అప్పటి నుంచి కంచన్ బాగ్ డీఆర్డీఓ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఏవో అశోక్ రెడ్డి ఈరోజు మృతిచెందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement