Wednesday, May 15, 2024

మా సభ ఎన్నికల కోసం కాదు.. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికే : కాంగ్రెస్ నేత‌ జైరాం రమేశ్

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం రెండూ కవల సోదరుల వంటివని కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ సభకు ముందు మీడియాతో మాట్లాడారు. తాము ఎన్నికల కోసం సభను నిర్వహించడం లేదని.. ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రజల ముందు పెట్టేందుకే సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. పెరుగుతున్న ధరలతో సామాన్యులు పడుతున్న కష్టాలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదని.. అందుకే ప్రధాన ప్రతిపక్షంగా తాము వీధుల్లోకి వచ్చి పోరాడుతున్నామని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ అన్నారు. అవినీతి ఆరోపణల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కాంగ్రెస్‌ సభలు, నిరసనలు చేపడుతోందన్న విమర్శలను జైరాం రమేశ్ తప్పుపట్టారు. తాము ప్రజల కోసం విస్తృతంగా ఆందోళనలు చేస్తున్నామని స్పష్టం చేశారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం తరహాలోనే ఈడీ, సీబీఐ కూడా మోదీ ప్రభుత్వానికి రెండు సోదరుల్లాంటివని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement