Tuesday, May 14, 2024

గ్రీన్ఇండియా ఛాలెంజ్ స్వీక‌రించిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ఇండియా ఛాలెంజ్ లో భాగంగా జూబ్లీహిల్స్ జీహెచ్ఎంసీ పార్క్ లో నటరాజ్ మాస్టర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నటరాజ్ మాస్టర్ మాట్లాడుతూ… పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. ప్రతి ఒక్కరూ వీలైనన్ని మొక్కలు నాటాలని, తద్వారా మంచి ఆక్సిజన్ పొందుతామన్నారు. రాబోయే తరాలకు చెట్ల ఉపయోగాలు తెలియజేయాల్సిన అవసరముంద‌న్నారు. అనంతరం లోబో, తనుజా, ఉమ ముగ్గురికి నటరాజ్ మాస్టర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విసిరారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement