Monday, April 29, 2024

Breaking : ఐఐఎఫ్ ఎల్ గోల్డ్ లోన్ మేనేజ‌ర్ నిర్వాకం – బెట్టింగ్ కోసం 14.4కిలోల బంగారం తాక‌ట్టు

హైద‌రాబాద్ ఐఐఎఫ్ ఎల్ గోల్డ్ లోన్ మేనేజ‌ర్ నిర్వాకం. బెట్టింగ్ మోజులో 14.4కిలోల బంగారం తాక‌ట్టు పెట్టారు. వ‌న్ స్టార్ బెట్ యాప్ లో రాజ్ కుమార్ బెట్టింగ్ కాశారు. క్రికెట్ లో ప్ర‌తి బాల్ పై రూ.ల‌క్ష పందెం క‌ట్టారు. సంస్థ‌లోని బంగారాన్ని తాక‌ట్టు పెట్టిరూ.3కోట్ల‌తో బెట్టింగ్ కు పాల్ప‌డ్డాడు రాజ్ కుమార్. కాగా సంస్థ ఆడిటింగ్ లో రాజ్ కుమార్ వ్య‌వ‌హారం బ‌ట్ట‌బ‌య‌లు అయింది. సంస్థ‌లో 14.4కిలోల బంగారం మాయ‌మైన‌ట్టు గుర్తించారు. ఈ మేర‌కు కీస‌ర పోలీస్ స్టేష‌న్ లో సంస్థ ప్ర‌తినిధులు ఫిర్యాదు చేశారు. ఈ మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement