Saturday, May 18, 2024

నిండు కుండలా మూసీ నది.. 6 గేట్ల ఎత్తివేత

ఎగువ నుంచి వస్తున్న భారీ వరద నీటితో కేతేపల్లిలోని మూసీ ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ప్రాజెక్టు 6 గేట్లను ఎత్తి అధికారులు దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 645 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టానికి గాను ప్రస్తుతం 638.30 అడుగులకు డ్యామ్ చేరుకున్నది. 3800 క్యూసెక్కుల నీరు ఇన్ ఫ్లో గా వస్తుండగా.. 3200 క్యూసెక్కుల నీటిని గేట్స్ ద్వారా దిగువకు వదులుతున్నారు. ఇక మూసీ గేట్లు తెరుచుకున్నాయాన్న సమాచారంతో పర్యాటకులు తరలి వచ్చి మూసి పరవళ్లును చూసి సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement