Wednesday, May 15, 2024

రాష్ట్ర ప్రజలకు హోలీ శుభాకాంక్షలు..

హైదరాబాద్ : రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ ప్రజలు అందరి జీవితాలు ఇంద్రధనస్సులోని సప్తవర్ణాలతో నిండి శోభిల్లాలని మంత్రి స‌ ఆకాంక్షించారు. కొవిడ్ నేపథ్యంలో ప్రజలు నిబంధనలు పాటిస్తూ పండుగను జరుపుకోవాలని కోరారు. ముఖ్యంగా చిన్నపిల్లల కళ్లల్లో రంగులు పడకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సహజ రంగులు, నీటితోనే పండుగను నిర్వహించుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌ పాలనలో పండుగలకు ప్రాధాన్యత పెరిగిందని చెప్పారు. అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగలను సుఖ సంతోషాలతో జరుపుకుంటున్నారని చెప్పారు. తెలంగాణ అన్ని మతాలు, వర్గాల కలయికగా భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శిస్తోందని.. హోలీ కూడా కులమతాలకు అతీతంగా ప్రజలంతా సంతోషంగా జరుపుకొనే పండుగ అని వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement