Sunday, April 28, 2024

ఎమ్మెల్యే సాయన్న పార్థీవదేహానికి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి నివాళులు

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మరణ వార్త అందరినీ కలచి వేసిందని, ఐదుసార్లు ఎమ్మెల్యే పనిచేశారంటే ప్ర‌జ‌ల‌కు ఆయ‌న‌పై ఉన్న న‌మ్మ‌కానికి నిద‌ర్శ‌నం అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అన్నారు. అనారోగ్యంతో కన్నుమూసిన ఎమ్మెల్యే సాయన్న పార్థివదేహానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పుష్పాంజలి ఘటించారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ప్రజాదరణ కలిగిన నాయకుడు సాయ‌న్న మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటున్నాని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement