Friday, April 26, 2024

ఉత్తమ మిమిక్రీ రత్న అవార్డు అందుకున్న మిమిక్రీ రమేష్

హైదరాబాదులో జరిగిన తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లో భాగంగా ప్రసాద్ లాబ్స్ హైదరాబాద్ లో తెలుగు సినిమా లెజెండ్ మెమోరియల్ అవార్డ్స్ ను ప్రధానం చేశారు. పలువురు సినీ నటులు, దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్స్ కు ఈ అవార్డులను ప్రధానం చేశారు. దీనిలో భాగంగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ కు ఉత్తమ మిమిక్రీ రత్న పురస్కారం అందజేశారు. ప్రముఖ సినీనటులు మురళీమోహన్, శివకృష్ణ చేతుల మీదుగా ఈ అవార్డును అందుకున్నారు మిమిక్రీ రమేష్.. ఈ కార్యక్రమంలో పలువురు సినిమా నటులు దర్శకులతో పాటు క్రాస్ రోడ్స్ అధినేత పలాటి వినోద్, టెక్నీషియన్స్ కార్యక్రమ నిర్వాహకులు జీవి మోహన్ గౌడ్, విజయవర్మ పాకాలపాటి, కూనిరెడ్డి శ్రీనివాస్ ఆర్ వి ఎన్ వరప్రసాద్, టీవీ నటుడు లోహిత్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement