Sunday, April 28, 2024

HYD: కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సేవాదళ్ అధ్యక్షుడిగా మిద్దెల జితేందర్

కర్మన్ ఘాట్, ఆగస్టు 24 (ప్రభ న్యూస్): తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడిగా మిద్దెల జితేందర్ ను నియమిస్తూ జాతీయ సేవాదళ్ అధ్యక్షుడు లాల్జీ దేశాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మిద్దెల జితేందర్ మాట్లాడుతూ… తన నియామకానికి సహకరించిన జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, రాష్ట్ర అధ్యక్షులు రేవంత్ రెడ్డి, శాసనసభ ప్రతిపక్ష నాయకుడు బట్టి విక్రమార్క, రాష్ట్ర నాయకులు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బూత్ కమిటీలు వేసి కాంగ్రెస్ పార్టీని పునర్ వైభవం తేవడంతో పాటు రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే విధంగా కృషి చేయనున్నట్లు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement