Saturday, May 11, 2024

WGL: రణరంగంగా ఎమ్మెల్యే దాస్యం క్యాంపు కార్యాలయం.. బీఆర్ఎస్, బీజేపీ బాహాబాహి

వడ్డేపల్లి.. (వరంగల్) : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ క్యాంపు కార్యాలయం ముట్టడి రణరంగంగా మారింది. ఈరోజు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ బాలసముద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించారు.

దీంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం రాళ్లు, కర్రలతో కార్యకర్తలు దాడికి దిగారు. ఇరువర్గాల దాడుల్లో కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు క్యాంపు కార్యాలయం వద్దకు భారీగా చేరుకొని కార్యకర్తలను అదుపు చేశారు. క్యాంప్ ఆఫీస్ కు వెళ్లే దారిలో ముల్లె కంచెలు, ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. పోలీసులు రాకేష్ రెడ్డిని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement