Thursday, May 2, 2024

Peddapalli: అభివృద్ధి, సంక్షేమానికి కేరాఫ్‌ తెలంగాణ… ఎమ్మెల్యే దాసరి

కాల్వశ్రీరాంపూర్‌, ఆగస్టు 24 (ప్రభ న్యూస్‌): అభివృద్ధి, సంక్షేమానికి చిరునామాగా తెలంగాణ రాష్ట్రం నిలుస్తోందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం కాల్వశ్రీరాంపూర్‌ మండలం పెద్దరాతుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే దాసరి వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సంక్షేమ పథకాలను అమలవుతున్నాయన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో పేదలకు మేలు చేసే ఎన్నో పథకాలను అమలు చేస్తూ ఆదర్శంతమైన పాలన అందిస్తున్నామన్నారు.

రాష్ట్రంలోని ప్రతి గడపకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయని, ప్రభుత్వ పథకం అందని ఇల్లు లేదంటే అతిశయోక్తి కాదన్నారు. ప్రజా సంక్షేమాన్ని ఓర్వలేక, అభివృద్ధిని చూసి జీర్ణించుకోలేక ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయన్నారు. అనవసర రాద్దాంతంతో ప్రజలను పక్కదోవ పట్టించాలని చూస్తున్నాయని, ప్రజలంతా అలాంటి పార్టీలతో అప్రమత్తంగా ఉంటూ పేదలకు మేలు చేసేందుకు నిరంతరం శ్రమిస్తున్న కేసీఆర్‌కు, బీఆర్‌ఎస్‌ పార్టీకి అండగా నిలవాలన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మూడోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ నూనేటి సంపత్‌, జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డితో పాటు బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement