Monday, May 13, 2024

Hyderabad: మాదాపూర్ లో భారీ చోరీ : రూ.50ల‌క్ష‌ల విలువైన సొత్తు మాయం

రూ.50ల‌క్ష‌ల విలువైన సొత్తును దొంగ‌లు ఎత్తుకెళ్లిన ఘ‌ట‌న‌ హైదరాబాద్ లో చోటుచేసుకుంది. న‌గ‌రంలోని మాదాపూర్‌లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇక్కడి కావూరి హిల్స్ ఫేజ్-2లో వ్యాపారి వాసుదేవరెడ్డి నివసిస్తున్నారు. గురువారం సాయంత్రం కుటుంబసభ్యులతో కలిసి మొయినాబాద్‌ సమీపంలోని తన ఫామ్‌హౌజ్‌కు వెళ్లి రాత్రి 11 గంటల సమయంలో తిరిగొచ్చారు. ఇంటి తాళం విరగ్గొట్టి ఉండడం చూసి హతాశులయ్యారు. వెంటనే లోపలికి వెళ్లి చూడగా కప్ బోర్డులో ఉంచిన రూ.20 లక్షల నగదుతోపాటు కొంతమొత్తంలో అమెరికన్ డాలర్లు, రూ.30 లక్షల విలువైన బంగారు ఆభరణాలు దాచి ఉంచిన సేఫ్ లాకర్ బాక్స్ మాయమైనట్టు గుర్తించారు. వెంటనే మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయ‌గా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement