Friday, May 24, 2024

HYD: పారిజాత నర్సింహారెడ్డితో మహేశ్వరం కాంగ్రెస్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మంతనాలు

మహేశ్వరం అర్బన్, నవంబర్ 7(ప్రభ న్యూస్)
మహేశ్వరం నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కోసం ఆశపడి బంగపడిన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహారెడ్డి టికెట్ కోసం విపల ప్రయత్నం చేసింది. నాలుగో తేదీన కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ అనుచరులు నామినేషన్ దాఖలు చేసిన సంగతి విధితమే. లక్ష్మారెడ్డి నీ అధిష్టానం అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి మహేశ్వరం నియోజకవర్గంలో అందరి నీ కలుపుకొని వెళ్ళాడు.

టికెట్ ఎక్కువగా ఆశించిన చిగురింత పారిజాత నరసింహారెడ్డి వారికి అందుబాటులో లేకపోవడంతో ఎన్ని రోజులు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు మంగళవారం ఉదయం బాలాపూర్ లోని మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంటికి మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థి గా పోటీ చేస్తున్న కీచ్చన్నగారి లక్ష్మారెడ్డి వెళ్లి మద్దతు తెలుపాలని కోరారు. ఇప్పటికే పారిజాత నరసింహారెడ్డి అనుచరులు నాయకులు కార్యకర్తలతో సమావేశం అయ్యారు . అందరి సమక్షంలోనే కిచెన్ గారి లక్ష్మారెడ్డి తనను గెలిపించాలని కోరినట్లు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement