Saturday, May 4, 2024

భావి తరాలకు నిత్య స్ఫూర్తి మహాత్మ పూలే.. లోకేష్ కుమార్

సమ సమాజ స్థాపనలో భావితరాలకు నిత్య స్ఫూర్తి ప్రదాతగా నిలిచిన మహాత్మ జ్యోతిరావు గోవిందరావు పూలే ను ఆదర్శంగా తీసుకోవాలని జిహెచ్ఎంసి కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 197వ జయంతిని పురస్కరించుకొని జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దిగువ కులాల ప్రజలకు సమాన హక్కులు పొందటానికి ఒక సొసైటీని ఏర్పాటు చేసిన మహనీయుడన్నారు. విద్య అవశ్యకతను, ప్రాధాన్యతను ప్రజలకు తెలియజేసి సమర్థించిన మొదటి సంస్కర్తగా పేరుగాంచారని ఆయన అన్నారు.

సమానత్వం కోసం ఎనలేని కృషి చేశారని, నేటి తరం ఆ మహనీయుని ఆశయ సాధనకు కృషి చేసినప్పుడే అతను చేసిన కృషికి సార్ధకత ఉంటుందని కమిషనర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ తో పాటుగా ఆయా విభాగాల హెచ్ ఓడీ లు సీసీపీ దేవేందర్ రెడ్డి, అడిషనల్ కమిషనర్ బి కృష్ణ జయరాజ్ కేనడి, సరోజ, అకౌంట్ ఎగ్జామినేర్ వెంకటేశ్వర్ రెడ్డి, సెక్రెటరీ లక్ష్మి సీపీఆర్ఓ మహమ్మద్ ముర్తుజ ఏ ఏం సి కే వెంకట రమణ, జీవన్ కుమార్ పీ అర్ ఓ పద్మ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement