Sunday, April 28, 2024

HYD : ఎల్బీనగర్‌లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయం మధు యాష్కి గౌడ్

కర్మన్ ఘాట్, నవంబర్ 5 (ప్రభ న్యూస్) ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని అభ్యర్థి మధు యాష్కి గౌడ్ అన్నారు. కోట్లు ఖర్చుపెట్టిన అధికార పార్టీకి ఓటు వేయరని మధు యాష్ కి గౌడ్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గం గ్రీన్ పార్క్ కాలనీ, త పో వన్ కాలనీ, వడ్డెర బస్తి, త్రిమూర్తి కాలనీ ,బృందావన్ కాలనీ, సాయి నగర్ కాలనీ, శివపురి కాలనీలో ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయా కాలనీవాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మధు యాష్ కి మద్దతు పలికారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటు వేసి గెలిపిస్తే ఎల్బీనగర్ నియోజకవర్గం అన్ని విధాలుగా అభివృద్ధి చేయటంతో పాటు తాను నియోజకవర్గ పరిధిలోని హయత్ నగర్ వాసి అని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే నాటి కాంగ్రెస్ ప్రభుత్వ ఆయంలో నిధులు మంజూరు అయినవని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ సమయంలో ఫ్లై ఓవర్ల నిర్మాణం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ఉన్నప్పుడు మంజూరైనట్లు తెలిపారు. అవకాశం కల్పిస్తే నియోజకవర్గంలో ఉంటూ అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో లింగోజిగూడ కార్పొరేటర్ ధర్పల్లి రాజశేఖర్ రెడ్డి ,జక్కడి ప్రభాకర్ రెడ్డి, మిద్దెల జితేందర్ ,న్యూ శివపురి కాలనీ అధ్యక్షులు రాజేష్ గౌడ్, నరేందర్ రెడ్డి ,కృష్ణ ,వెంకటేశ్వర టెంపుల్ చైర్మన్ వెంకటరెడ్డి, వరలక్ష్మి ,అనసూయ, గోపాల్ ముదిరాజ్ ,సుధీర్ రెడ్డి ,శ్రీధర్ గౌడ్ లు పాల్గొనగా ఆయా కాలనీలో కాలనీ సంక్షేమ సంఘం నాయకులు ప్రతినిధులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మద్దతు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement