Sunday, April 28, 2024

HYD: నామినేషన్లు దాఖలు చేసిన మధు యాష్కి, సామ సుందర్ రెడ్డి

ఎల్బీనగర్, నవంబర్ 9 ప్రభ న్యూస్ : న‌గ‌రంలో ప‌లు పార్టీల నాయ‌కులు నామినేష‌న్లు దాఖ‌లు చేశారు. ఎల్బీనగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కి నామినేషన్ దాఖలు చేశారు. హయత్ నగర్ లో కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి మధుయాష్కీ గౌడ్ తల్లి సులోచన ఆశీస్సులు తీసుకొని, కొత్తపేట్ లోని ప్రసన్న మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత, త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆర్‌వో కార్యాల‌యంలో ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారి పంకజకు స‌మ‌ర్పించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్,తీన్మార్ మల్లన్న,న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్,కాంగ్రెస్ ముఖ్య నాయకులు,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

నామినేషన్ వేసిన యాకత్పురా బీఆర్ఎస్ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి..
కర్మన్ ఘాట్ : యాకత్ పురా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సామ సుందర్ రెడ్డి సైదాబాద్ తహసీల్దార్ కార్యాలయంలో గురువారం నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి చంపాపేట తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి నామినేషన్ వేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ మాజీ కార్పొరేటర్ సామ స్వప్న సుందర్ రెడ్డి, సీనియ‌ర్ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement