Sunday, May 5, 2024

Kamareddy – సార్… మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి….. కెసిఆర్ తో గంప గోవ‌ర్ధ‌న్

కామారెడ్డి ధి ప్రభ న్యూస్…… సార్… మీ ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండాలంటూ కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ సీఎం కేసీఆర్ ను వేడుకున్నారు. గురువారం ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఎమ్మెల్యే గోవర్ధన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. నా కోరిక మేరకే మీరు పోటీ చేస్తున్నారని మిమ్మల్ని గెలిపించే బాధ్యత నాపై ఎంతైనా ఉందని గోవర్ధన్ కెసిఆర్ కు చెప్పారు. అనంతరం ప్రత్యేక వాహనంలో సీఎం కేసీఆర్ గోవర్ధన్ ఇంటికి వెళ్లి ముఖ్య నాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు .పార్టీలో గ్రూపు రాజకీయాలు కొనసాగుతుండడం పై సీఎం కేసీఆర్ సీరియస్ అయ్యారు. గ్రూప్ రాజకీయాలు చేసేవారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. నాయకులందరూ కలిసికట్టుగా పనిచేయవలసిన అవసరం ఎంతైనా ఉందని సూచించారు. ఎవరికి ఏమైనా ఇబ్బందులు ఉంటే నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. ఆయన వెంట పార్టీ ముఖ్య నాయకులు ఉన్నారు.

సీఎం కేసీఆర్ కు స్వాగతం పలికిన వారిలో రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీధర్ ఎమ్మెల్సీ సుభాష్ రెడ్డి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేశ్వర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తిరుమలరెడ్డి జిల్లా భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు ముజీబ్ రాష్ట్ర నాయకులు ఎంజీ వేణుగోపాల్ గౌడ్ వేణుగోపాలరావు ఉన్నారు

Advertisement

తాజా వార్తలు

Advertisement