Thursday, May 2, 2024

డ్రంక‌న్ డ్రైవ్ త‌నిఖీల‌లో గాయ‌ప‌డిన ఎ ఎస్ ఐ మ‌హిపాల్ రెడ్డి కన్నుమూత‌..

హైద‌రాబాద్ : విధి నిర్వ‌హ‌ణ‌లో గాయ‌ప‌డిన కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి మృతి చెందాడు. ఈ నెల 27న నిజాంపేట రోడ్‌లో ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి, హోంగార్డు క‌లిసి డ్రంక్ అండ్ డ్రైవ్ త‌నిఖీలు నిర్వ‌హించారు. ఈ క్ర‌మంలో మ‌ద్యం మ‌త్తులో ఉన్న క్యాబ్ డ్రైవ‌ర్ వారిని ఢీకొట్టాడు. దీంతో ఏఎస్ఐ తీవ్రంగా గా య‌ప‌డ‌టంతో ఆయ‌న‌ను చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. చికిత్స పొందుతూ నేటి ఉద‌యం మ‌హిపాల్ రెడ్డి క‌న్నుమూశారు. విష‌యం తెలుసుకున్న పోలీస్ అధికారులు దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు.. అత‌డి మృతికి సంతాపం ప్ర‌క‌టించారు. కాగా,కేపీహెచ్‌బీ ఏఎస్ఐ మ‌హిపాల్ రెడ్డి భౌతిక‌కాయానికి సైబ‌రాబాద్ పోలీసు క‌మిష‌న‌ర్ స‌జ్జ‌నార్ నివాళుల‌ర్పించారు. మ‌హిపాల్ రెడ్డి కుటుంబ స‌భ్యులను ప‌రామ‌ర్శించి, ప్ర‌గాఢ సానుభూతి తెలిపారు. మ‌హిపాల్ రెడ్డి భౌతిక‌కాయానికి పోలీసులు గౌర‌వ వంద‌నం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement