Sunday, May 5, 2024

9 మందితో ప్రేమ…9 పెళ్లిళ్లు… ఆ తరువాత వ్యభిచారం

చట్టాలు ఎన్ని వస్తున్నా… శిక్షలు ఎన్ని పడుతున్నా మహిళలపై దాడులు అకృత్యాలు ఆగడం లేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఏదో ఒక విధంగా మహిళల్ని ఇబ్బంది పెడుతూనే ఉన్నారు కొంతమంది మృగాలు. తాజాగా విశాఖలో ఓ మానవ మృగం వెలుగులోకి వచ్చింది. ప్రేమ పేరుతో అమ్మాయిలను పెళ్లి చేసుకొని ఆ తరువాత వ్యభిచార కూపంలోకి నెడుతున్నాడు ఈ మృగాడు. వివరాల్లోకి వెళితే విశాఖపట్నానికి చెందిన అరుణ్ కుమార్ అమ్మాయిలను టార్గెట్ గా పెట్టుకుని ప్రేమ పేరుతో వారిని నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకునేవాడు. ఇప్పటివరకు ప్రేమ పేరుతో మొత్తం తొమ్మిది మందిని పెళ్లి చేసుకున్నాడు. అయితే పెళ్లి తరువాత వ్యభిచారం చేయాలంటూ వారిపై వత్తిడి చేసేవాడు. శారీరకంగా కూడా హింసించేవాడు.

ఇక ఆఖరికి ఓపిక నచించిన బాధిత మహిళలు పోలీసులను ఆశ్రయించటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే అతని మాటలు వినకపోతే.. చంపేస్తానని గన్ తో బెదిరించేవాడని, దాడి చేసి చిత్రహింసలకు గురి చేసేవాడని బాధిత మహిళలు చెప్తున్నారు.
కాగా తమకు న్యాయం చెయ్యాలంటూ పోలీసులను ఆశ్రయిస్తే పోలీసులు ఒంటిపై దెబ్బలు చూపించాలి అంటూ బాధితులను తిరిగి వేధించటంతో మహిళా చేతన అనే సంస్థను బాధితులు ఆశ్రయించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement