Sunday, May 5, 2024

సుప్రీంకోర్డు చీఫ్ జస్జీస్ రమణకు కెసిఆర్ శుభాకాంక్షలు

హైద‌రాబాద్ : సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా ప్ర‌మాణం చేసిన జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు తెలంగాణ రాష్ర్ట ముఖ్య‌మంత్రి కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ మేరకు కెసిఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మీ విశేష అనుభ‌వం దేశానికి ఎంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంద‌న్నారు. మీ ప‌ద‌వీకాలం గొప్ప‌గా సాగాల‌ని ఆకాంక్షిస్తున్న‌ట్లు సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. కాగా,సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ శ‌నివారం ఉద‌యం ప్ర‌మాణం చేసిన సంగ‌తి తెలిసిందే. జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణతో రాష్ర్ట‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్ర‌మాణ‌స్వీకారం చేయించారు. 48వ సీజేఐగా జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ 2022, ఆగ‌స్టు 26వ తేదీ వ‌ర‌కు ఈ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement