Friday, April 26, 2024

అభివృద్ధి వైపే ఓరుగల్లు ప్రజలు…. ఎమ్మెల్యే ఆరూరి..

వ‌రంగ‌ల్ – తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమనికి కృషి చేస్తున్న ప్రభుత్వం తెరాస ప్రభుత్వమ‌ని, ఓట‌ర్లు అది గ‌మ‌నించి కారు గుర్తుకు ఓటేసి అఖండ విజ‌యం చేకూర్చాల‌ని ఎమ్మెల్యే ఆరూరి ర‌మేష్ పిలుపు ఇచ్చారు..గ్రేటర్ వరంగల్ ఎన్నికలలో భాగంగా 46వ డివిజన్ మడికొండ, రాంపూర్ లో మాజీ డిప్యూటీ సీఎం, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి తో క‌ల‌సి ఎమ్మెల్యే అరూరి రమేష్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకి ఓటేసి 46వ డివిజన్ తెరాస అభ్యర్థి మునిగాల సరోజని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ఇంచార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement