హైదరాబాద్: బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సామాజిక తత్వవేత్త, నవయుగ వైతాళికుడు మహత్మా జ్యోతిరావు పూలే అని అంతర్జాతీయ వైశ్య ఫెడరేషన్ ఐవీఎఫ్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్, జాతీయ ప్రధాన కార్యదర్శి అండ్ తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ పూర్వ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా అన్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ చౌరస్తాలో మహత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఉప్పల శ్రీనివాస్ గుప్తా పాల్గొని, మహత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆ మహనీయుని స్మరించుకుంటూ, వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దీప భాస్కర్ రెడ్డి, బేర బాల కిషన్, అరవింద్ కుమార్, వెంకట్ గౌడ్, స్కూల్ స్టూడెంట్స్, అన్నిపార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.