Tuesday, May 14, 2024

HYD: మధు యాష్కీ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ లో చేరికలు

కర్మన్ ఘాట్, నవంబర్ 17 (ప్రభ న్యూస్) : ఎల్బీనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ తెలిపారు. అవినీతి పాలనను అంతమొందించేందుకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపాలని ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధు యాష్కీ గౌడ్ అన్నారు.

చంపాపేట్ డివిజన్ కు చెందిన బీఆర్ఎస్ నేతలు, మాజీ కౌన్సిలర్ బిక్షపతి గౌడ్, మధు యాష్కీ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ… ఎల్బీనగర్ నియోజకవర్గంలో తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన వారిలో సీనియర్ నాయకులు సురిగి పెంటయ్య గౌడ్, ఎరుకల లక్ష్మణ్ గౌడ్, చేగొని విటల్ గౌడ్, ప్రభాకర్, సత్యనారాయణ గౌడ్, చంద్ర గౌడ్, అంజయ్య, దశరథ్ ముదిరాజ్ పార్టీలో చేరినట్లు ఎరుకల విశ్వనాథ్ గౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement