Tuesday, April 30, 2024

గచ్చిబౌలిలో పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభం

హైదరాబాద్ : గచ్చిబౌలిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నాణ్యమైన చికిత్స అందించే కేన్సర్ ఆసుపత్రిని ఏర్పాటు చేశారు. పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ పేరుతో ఈ హాస్పిటల్ ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిధిగా హాజరై లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… అమెరికాలో అందించే క్యాన్సర్ వైద్యం హైదరాబాద్ లో అందుబాటులోకి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. క్యాన్సర్ పై పరిశోధన చేయవల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రైవేటు హాస్పిటల్స్ వారు మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వైద్యం అందించాలన్నారు. మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుని వైద్యం అందించాలని మంత్రి కోరారు. గచ్చిబౌలిలోని పై హెల్త్ క్యాన్సర్ హాస్పిటల్ హెడ్ గా వినాయక రెడ్డి వ్యవహరించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement