Tuesday, May 14, 2024

HYD : అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్యం… ఎంపీ అభ్య‌ర్థి పట్నం సునీత

నాగోల్, ఏప్రిల్ 29(ప్ర‌భన్యూస్) : అభివృద్ది కాంగ్రెస్‌తోనే సాధ్య‌మ‌ని మ‌ల్కాజ్‌గిరి లోక్‌స‌భ‌ ఎంపీ అభ్య‌ర్థి ప‌ట్నం సునీత తెలిపారు. సోమ‌వారం ఆమె జైపూరి కాలనీ ఫత్తుల గూడా, 58 సర్వే నెంబర్ , డివిజన్ లో పలు కాలనీల లో పాదయాత్ర చేపట్టారు.

- Advertisement -

అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించి అభిమానించి, అహంకారపురితమైన బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపి ప్రజా ప్రభుత్వమైన కాంగ్రెస్ పార్టీకి ఏ విధంగా అయితే పట్టం కట్టారో అదేవిధంగా లోక్‌స‌భ‌ఎన్నికల్లో కూడా బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దింపి కేంద్రం లో కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని కోరారు. త్వరలోనే నాగోల్ డివిజన్ లో జైపూరి కాలనీ,ఫత్తుల గూడ, నువ్వుల బండ, 58 సర్వేనెంబర్, పలు కాలనీలో ఉన్న డ్రైనేజ్ సమస్యలు, ఇతర సమస్యలు పరిష్కరించి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాగోల్ డివిజన్ అధ్యక్షురాలు మంజుల రెడ్డి, టిపిసిసి అధికార ప్రతినిది జేపీఆర్, నియోజకవర్గ సీనియర్ నాయకులు, ముద్దగౌని రామ్మోహన్ గౌడ్, జోగు రాములు, డివిజన్ నాయకులు కృపాకర్ రెడ్డి, చెరుకు చిరంజీవి, జైపాల్ రెడ్డి, భవాని, బద్రు నాయక్,వినయ్, మహిళా నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement