Tuesday, April 30, 2024

HYD : గొప్ప ప్రధాని నరేంద్ర మోదీ: మాజీ మంత్రి ఈటల రాజేందర్

ఎల్బీనగర్, మార్చి 11(ప్రభ న్యూస్) : ప్రజల కోసం పనిచేసే వారే నిజమైన నాయకులని,ప్రజల అవసరాలను గుర్తించి పథకాలను అందించే వ్యక్తి మన ప్రధాని నరేంద్ర మోదీ అని మాజీమంత్రి, మల్కాజ్‌గిరి పార్లమెంట్ బిజెపి పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. బియన్ రెడ్డి నగర్ డివిజన్ ఎన్జీవోస్ కాలనీ రాజీవ్ గాంధీ పార్క్ లో వాకర్స్ ఏర్పాటు చేసిన సమావేశానికి బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ హాజరయ్యారు.

- Advertisement -

నమ్మిన సిద్ధాంతాల కోసం కట్టుబడిన వ్యక్తినని మోదీ అని అన్నారు. రాజకీయాలలో కమిట్మెంట్, క్రెడిబిలిటీ ఉండాలని ప్రస్తుతం అధికారం ఉంటే ఒక మాట లేకుంటే మరో మాట అన్న విధంగా ఉందన్నారు. పోరాటాలు ధర్నాలతో తెలంగాణను సాధించుకున్నామని , అలాంటి ధర్నా చౌక్ ను, సంఘాలను లేకుండా చేయాలని కేసిఆర్ చూశాడన్నారు. సముద్రం గర్భంలోని కిరీటం ఒడ్డుకు ఎలా చేరుతుందో, ప్రజలు తలుచుకుంటే అదేవిధంగా ఫలితాలు ఉంటాయన్నారు.

ప్రభుత్వాలు ప్రజల విశ్వాసం సంస్కృతిని కాపాడే విధంగా ఉండాలన్నారు. అమలు కానీ హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రజలుకు విషయం అర్థమవుతుందన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి సంక్షేమ పథకాలు అందిస్తున్న గొప్ప ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ప్రజల కోసం పనిచేసే వ్యక్తినని , ఆశీర్వదించి సేవ చేసే భాగ్యం కల్పించాలని కోరారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement